
కె24 న్యూస్ తెలుగు జూన్ 21. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గంగాధరనెల్లూరు మండలంలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో BJP మండల అధ్యక్షుడు జి.ఆనందబాబు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. ఓబీసీ జిల్లా అధ్యక్షులు కైలాసం ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ వి.రాజేంద్రన్, చిత్తూరు జిల్లా ఎస్సి మోర్చా జనరల్ సెక్రటరీ ఎస్.సుందరం, యువ మోర్చా జనరల్ సెక్రటరీ ఢిల్లీ బాబు, సోషల్ మీడియా కన్వీనర్ హరి ప్రసాద్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఆనంద రెడ్డి, పార్టీ నాయకులు, పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.