[caption id="attachment_3691" align="alignleft" width="1600"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల కేంద్రంలోని 13వ వార్డు ధర్యాపూర్ హనుమాన్ ఆలయం సమీపంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏన్యుమరేషన్ దరఖాస్తు పత్రాలను నింపే విధానం, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నవీపేట్ ఉప సర్పంచ్ నవీన్ రాజ్, 13వ వార్డు సభ్యులు కోనేరు సరిత గంగాధర్, 14వ వార్డు సభ్యులు సాయి తేజ, బీఎల్ఓలు సునీత, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని వారు సూచించారు.[/caption]