కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్)సెప్టెంబర్ 05. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ప్రతి శనివారం ఇక్కడ సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ ఏద్దాల బాలకృష్ణారెడ్డి,ఏద్దాల శివశంకర్ రెడ్డి అన్నదాన వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బి.దామోదర్ రెడ్డి, ఆర్టీఐ యాక్టివిస్ట్&ఆర్టీఐ-ఏఎస్ ఫౌండర్ బండి పట్టాభిరెడ్డి, బి.మాధవిలత పాల్గొని అనాథలకు స్వయంగా భోజనం వడ్డించారు.