కె24న్యూస్ తెలుగు జూన్ 21. అన్నమయ్య జిల్లా మదనపల్లి రామారావు కాలనీ మున్సిపల్ పార్కులో జిడి తైక్వాండో ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పి.జ్ఞానవి రెడ్బెల్ట్ సాధించి సత్తా చాటింది. పదో తరగతి చదువుతున్న పి.జ్ఞానవి, చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం తైక్వాండోలో శిక్షణ తీసుకుంటోంది. రాష్ట్ర స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి, తన కోచ్ గంగరాజుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. ఈ కార్యక్రమంలో జాక్ జావీద్, సుభద్ర, అబు, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.