తిమ్మాపూర్, జూలై 28 (తెలుగు K24 న్యూస్): కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో జేబుదొంగలు రెచ్చిపోయారు. బస్సు కోసం వేచి చూస్తున్న ఓ వ్యక్తి జేబులో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ.5,000 నగదును చాకచక్యంగా అపహరించారు.కొద్దిసేపటి తర్వాత తన జేబులోని నగదు కనిపించకపోవడంతో బాధితుడు అప్రమత్తమై విషయం గుర్తించాడు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
బాధితుడి పూర్తి వివరాలు, ఘటన జరిగిన పరిస్థితులు, పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.