Logo
Date of Publish : 13 July 2026, 8:45 am
Editor : Katta Ravindar

పాడి రైతుల పిల్లలకు కరీంనగర్ పాలడైరీ స్కాలర్‌షిప్‌లు

ఉన్నత విద్యతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష

బెజ్జంకి, జూలై 13 (కె24 న్యూస్):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కరీంనగర్ పాలడైరీలో పాలు సరఫరా చేసే పాడి రైతుల కుటుంబాల విద్యార్థులకు కరీంనగర్ పాలడైరీ ఆధ్వర్యంలో సోమవారం స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు.
గుగ్గిళ్ల గ్రామంలోని పాలడైరీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ పాలడైరీ అధ్యక్షులు కేడిక మాధుసూదన్ రెడ్డి, మేనేజర్ సుధాకర్, సైట్ సూపర్‌వైజర్ ధన్‌రాజ్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాడి రైతుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యారంగంలో రాణించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి అండగా నిలవడం కరీంనగర్ పాలడైరీ సామాజిక బాధ్యతలో భాగమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమంతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాడి రైతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాలడైరీ ప్రతినిధులు పాల్గొన్నారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )