కామారెడ్డి జిల్లా :తెలుగు k24 న్యూస్ :
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల కు చెందిన శ్రీనాథ్ రెడ్డి(34) మూడు రోజుల క్రితం లండన్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని మృతదేహాన్ని వీలైనంత త్వరలో గ్రామానికి తెప్పించాలని కోరుతూ కుటుంబ సభ్యులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ని కలిసి వేడుకున్నారు. మృతదేహాన్ని రప్పించేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.