కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :
కామారెడ్డి మండలం లింగాయి పల్లి కోటాలపల్లి గ్రామాలకు చెందిన కళాశాల విద్యార్థులు సోమవారం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. కళాశాలలకు వెళ్లే సమయంలో బస్సులు ఆపడం లేదని విద్యార్థులు ఆరోపించారు. రాజంపేట నుంచి వచ్చి బస్సులు నిలపకపోవడం వల్ల సమయానికి కళాశాలకు చేరుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య డిపో మేనేజర్ దినేష్ పరిష్కరించలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనలు పాల్గొన్నారు.