
కామారెడ్డి జిల్లా : తెలుగు కే24 న్యూస్
విద్యుత్ రంగ ఉద్యోగులు, కార్మికుల సంఘం (సిఐటియు) సర్వసభ్య సమావేశం కామారెడ్డిలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన పలువురు సిఐటియులో చేరారు.
రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్మికులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, గంగాధర్, జిల్లా కార్యదర్శి మోహన్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సునీల్ గౌడ్, ఉపాధ్యక్షుడు నర్సా గౌడ్, బాలరాజు, బాలేశం, నర్సింలు, రాఘవాచారి, దేవదాస్, అశోక్ రెడ్డి, రవికుమార్, ప్రశాంత్, ప్రతాప్, నరేష్ తదితరులు పాల్గొన్నారు