[caption id="attachment_5868" align="alignright" width="1599"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట మండల కేంద్రంలో:- సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళుతున్న అంగన్వాడీలను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని సిపిఎం పార్టీ తప్పుపడుతుంది నవీపేట్ మండలంలో నవీపేట అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిన్నటి ఆశా వర్కర్ల చలో కార్యక్రమంలో కూడా పోలీసుల అత్యుత్సాహం వల్ల చాలామంది మహిళలకు గాయాల పాలయ్యారు ప్రజా పాలన అంటే గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజా దర్బారు దర్వాజాలు పగలగొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వస్తున్న వారిని ఎందుకు ఇలా నిర్వర్తిస్తున్నారని ప్రశ్నించారు ఇకనైనా ఈ ప్రభుత్వాలు అక్రమ అరెస్టులను మానుకోవాలని అన్నారు రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఈరోజు జరిగిన సంఘటనలు ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు స్పీకర్ వారి తల్లిని అసభ్య పదాజాలంతో దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దీన్ని ఖండిస్తూ ప్రజాధనంని వృధా కాకుండా ప్రజా సమస్యల చర్చించే వేదిక కావాలని శాసనమండలి శాసనసభలకు ఎన్నికైన ప్రతినిధులు ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొని సభను సజావుగా సాగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్. షేక్ మహబూబ్. మేకల ఆంజనేయులు. గౌతమ్ పాల్గొన్నారు.[/caption]