కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : చుక్కాపూర్ గ్రామానికి చెందిన సంధ్యారాణి (30) అనే మహిళ వ్యక్తిగత కారణాలు మరియు మనస్తాపంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన పిల్లలైన బాబు (5), పాప (3)లను స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్లకుండా, నేరుగా రైల్వే ట్రాక్ వద్దకు తీసుకువెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
సమాచారం అందుకున్న వెంటనే కానిస్టేబుల్ కళ్యాణ్ (PC-2918) మరియు రామకృష్ణ (ARPC 3042) అత్యంత చురుగ్గా,సమయస్ఫూర్తితో వ్యవహరించారు.వెంటనే రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని,ఆమెను మరియు పిల్లలను సురక్షితంగా కాపాడి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు.
అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యాన్ని నింపారు.సమయానికి స్పందించి ముగ్గురి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు కళ్యాణ్, రామకృష్ణల చాకచక్యాన్ని, ప్రతిభను పట్టణ సీఐ నరహరి అభినందించడం జరిగింది.