తెలుగు కే న్యూస్ కామారెడ్డి జిల్లాలో అమలవుతున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి బి. విజయేంద్ర, ఐఏఎస్., కార్యదర్శి, ఎస్సీడీ, కార్యదర్శి, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ & కమిషనర్, ఎస్సీడీ (ఎఫ్ఏసీ) శనివారం జిల్లా కలెక్టరేట్కు విచ్చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రత్యేక అధికారికి పూలమొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కూడా ప్రత్యేక అధికారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలు, పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.