కామారెడ్డి, K24 న్యూస్ తెలుగు:
కామారెడ్డి మున్సిపల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్–బీఆర్ఎస్ కుమ్మక్కై పదవులను పంచుకున్నాయని ఆరోపించారు. అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదని, అవినీతి బిల్లులకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. గత ఎజెండాలో అవినీతికి అవకాశం ఉన్న అంశాలను మళ్లీ ఆమోదానికి తీసుకురావడాన్ని తాము వ్యతిరేకించామని తెలిపారు.
గడువు ముగిసినా తాయ్ బజార్ పేరుతో వసూళ్లు కొనసాగుతున్నాయని, మున్సిపల్ సిబ్బందికి పనిముట్ల కొనుగోలులో రూ.8 లక్షల స్కాం జరిగిందని ఆరోపించారు. మున్సిపల్ బిల్లుల చెల్లింపుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.