కామారెడ్డి జిల్లా, జూలై 21 (K24 న్యూస్):
నిజాంసాగర్ మండల కేంద్రంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రజా పండరి, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.