Logo
Date of Publish : 30 June 2026, 1:24 am
Editor : Katta Ravindar

నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నది సమీపంలో ఉన్న ఓం శ్రీ వరలక్ష్మి ఆశ్రమం

నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నది సమీపంలో ఉన్న ఓం శ్రీ వరలక్ష్మి ఆశ్రమం వద్ద, ఆశ్రమ ఉత్తరాధికారి నర్సూరి శ్రీనాథ్ రావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి మరుసటి రోజు శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజు పుణ్యతిథి సందర్భంగా పవిత్ర గోదావరి నది పుష్కర మొదటి ఘాట్ వద్ద అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన ప్రసాదం పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. ఆశ్రమ ఉత్తరాధికారి శ్రీ శ్రీనాథ్ రావు తరఫున ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిమళ గారు హాజరై, ముందుగా శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజ్ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, "జీవితంలో సరైన మార్గదర్శకత్వం కోసం ప్రతి ఒక్కరూ గురువు బాటలో నడవాలి. గురువులు మనకు విజ్ఞానాన్ని, నైతికతను మరియు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతారు. శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజ్ వారి మార్గదర్శకత్వం మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది" అని పేర్కొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )