[caption id="attachment_3585" align="alignleft" width="1920"]
నిజామాబాద్ జిల్లా :-బస్టాండ్లలో రద్దీని ఆసరాగా చేసుకుని వృద్ధ మహిళల మెడలోని బంగారు గొలుసులు, బ్యాగుల్లోని విలువైన వస్తువులు చోరీ చేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అంతర్జిల్లా దొంగల ముఠాను నవీపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి **63 గ్రాముల బంగారం (సుమారు రూ.10 లక్షల విలువ)**తో పాటు రూ.5 లక్షల విలువైన ఎర్టిగా కారును స్వాధీనం చేసుకున్నారు.
నవీపేట్ బస్టాండ్లో వృద్ధ మహిళ మెడలోని గుండ్ల తాడును కత్తిరించిన కేసు దర్యాప్తులో ముఠా గుట్టురట్టైంది. నిజామాబాద్, నందిపేట ప్రాంతాల్లోనూ ఇదే తరహా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును ఛేదించిన నవీపేట్ ఎస్ఐ కే. శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసు బృందాన్ని ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.[/caption]