కరీంనగర్: తెలుగు కేఈ న్యూస్ తనకు చెందిన 30 గుంటల భూమిని చల్మెడ లక్ష్మీనరసింహారావు అక్రమంగా ఆక్రమించుకున్నారని భూ బాధితురాలు కాసర్ల మంజుల నివాసం. సింగరేణి కార్మికుడైన తన భర్త మృతి అనంతరం వచ్చిన డబ్బులతో రెండు దఫాలుగా 20, 10 గుంటల చొప్పున భూమిని కొనుగోలు చేశానని, పట్టా పాస్బుక్తో పాటు రైతుబంధు కూడా వస్తోందని తెలిపారు.గత మూడు నెలలుగా తన భూమి హద్దులు తొలగించి ప్రహరీ గోడ నిర్మించారని, స్థలంలోకి తనపై దాడికి ప్రయత్నించి బెదిరింపులకు ప్రయత్నించారు. పోలీసుల పేరుతో తనపై కేసులు పెడతానంటూ బెదిరించారని అన్నారు.తన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వ అధికారులు సర్వేకు వచ్చినప్పటికీ, చల్మెడ అనుచరులు అడ్డుకోవడంతో సర్వే నిలిచిపోయిందని తెలిపారు. ఇకపై తన భూమి విషయంలో జోక్యం చేసుకుంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటే అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని, సర్వే నిర్వహించి తన భూమిని తనకు అప్పగించాలని కాసర్ల మంజుల డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, అంకం శివరాణి, రంగరవేణి లక్ష్మణ్, బసవేణి రాజేందర్, మడిపల్లి వినీత్, పూసాల రణదీర్, కృష్ణ ఉన్నారు.