[caption id="attachment_5891" align="alignright" width="2560"]
నిజామాబాద్ జిల్లా, నవీపేట మండలం మద్దేపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె తెలంగాణ రైతాంగ ఉద్యమంలో చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.
వక్తలు మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి రైతులకు ధైర్యం నింపిన మహానేత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నేటి తరానికి ఆమె జీవితం ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.[/caption]