[caption id="attachment_5203" align="alignright" width="2560"]
నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్:-మద్దేపల్లి: గ్రామంలోని పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.[/caption]