గన్నేరువరం, ఆగస్టు 29 (తెలుగు న్యూస్ ): మాలల హక్కుల పరిరక్షణ, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత అవకాశాల కోసం ఈ నెల 31న హైదరాబాద్లోని డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద 'చలో సెక్రటేరియట్' కార్యక్రమ నిర్వహణ కోసం గన్నేరువరం మండల మాల మహానాడు అధ్యక్షులు అనుమండ్ల మల్లేశం, గౌరవ అధ్యక్షులు న్యాయ సుధాకర్ తెలిపారు.జీవో నంబర్ 99ను రద్దు చేయడంతో పాటు రోస్టర్ విధానంలోని రెండు పాయింట్లను సవరించాలని కోరారు. వర్గీకరణ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి మాలలకు న్యాయం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా మాలలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పార్టీ.కార్యక్రమంలో జిల్లావర్గ సభ్యులు తుమ్మ ప్రభాకర్, మండల ఉపాధ్యక్షులు కర్నె కొమురయ్య, న్యాయ రాజేందర్ ఉన్నారు. జై మాల అంటూ విజయవంతం చేయాలని కోరుకున్నారు.