కామారెడ్డి, జూలై 21 (K24 న్యూస్): వనమహోత్సవం సందర్భంగా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈతమొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణతో పాటు గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఈత చెట్ల పెంపకం ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.