Logo
Date of Publish : 10 September 2026, 10:42 am
Editor : Katta Ravindar

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ని, ఆయన తల్లిని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ అనుచిత, అన్‌పార్లమెంటరీ పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు భూమని బాలరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్‌ఎస్ పార్టీ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,

రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై వ్యక్తిగతంగా, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ గౌరవాన్ని, రాజ్యాంగ పదవుల ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని పేర్కొన్నారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఆయనను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా కాంగ్రెస్ నాయకులు అభివర్ణించారు. బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.

అన్‌పార్లమెంటరీ పదజాలంతో వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌లను వెంటనే వారి పదవుల నుంచి సస్పెండ్ చేయాలని, వారిపై చట్టపరంగా, పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

అలాగే ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాసనసభ గౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.

ఈ ధర్నాలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు. దళిత నాయకులను అవమానించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో
పట్టణ కాంగ్రేస్ అధ్యక్షులు ఐరేణి సందిప్
రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్ర కరన్ రెడ్డి
లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్ర కాంత్ రెడ్డి,గుడెం శ్రీనివాసరెడ్డి- రాజు గౌడ్ ఇప్ప శ్రీనివాస్ కన్నయ్య,తోగరి సుదర్శన్, తుడుం జీవన్

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )