[caption id="attachment_3701" align="alignleft" width="1599"]
నిజామాబాద్ జిల్లా, నడుకూడ:
నడుకూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గౌరవ బట్టు సంజీవ్ రాజ్ గారి ఆధ్వర్యంలో SIR (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలో మరణించిన వారి వివరాలు, ఇతర గ్రామాలకు వెళ్లిపోయిన వారి వివరాలు, గ్రామానికి కొత్తగా వచ్చిన వారి వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, తొలగింపులు చేపట్టే ప్రక్రియపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, BLOలు, మండల సూపర్వైజర్లు, గ్రామ ప్రజలు పాల్గొని ఓటరు జాబితా సవరణపై అవగాహన పొందారు. అధికారులు సూచించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.[/caption]