ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని మరియు పోచంపల్లి చిలుకల చిన్నమ్మ గ్రామ దేవతలను దర్శించుకున్నారు. ఆషాడమాసం ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆయన వెంట ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు కెవి రమణ, తదితరులు పాల్గొన్నారు.