నిజామాబాద్ జిల్లా,
జక్రాన్ పల్లి మండలం, జులై 24, తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
జక్రాన్ పల్లి మండలం పరిధిలోని ముని పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బిసి గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్27న మునిపల్లి గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
ఈ నెల 27 (సొమవరం)న ఇంటర్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు, ఆర్సీఓ, కళాశాల ప్రిన్సిపాల్ సంయుక్తంగా తెలిపారు. ఆర్మూర్ (COE), సాలూర (COE), బాల్కొండ కళాశాలల్లో మిగిలిన MPC, BiPC గ్రూపుల సీట్ల భర్తీ కోసం ఈ స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
పదో తరగతిలో 480 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు తల్లిదండ్రులతో కలిసి నేరుగా మునిపల్లి కళాశాలకు హాజరుకావాలని సూచించారు. మెమో, ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఐదు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, మూడు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని అధికారులు కోరారు.