Logo
Date of Publish : 11 July 2026, 12:02 pm
Editor : Katta Ravindar

పలమనేరులో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన MP, MLA!

కె 24న్యూస్ తెలుగు జూలై 11. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో రూ.20 లక్షల MP నిధులతో పునఃర్నిర్మించిన ప్రభుత్వ సాంఘీక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని చిత్తూరు MP దగ్గుమళ్ళ ప్రసాదరావు, స్థానిక MLA అమర్నాథ్ రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు వసతి గృహంలోని సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి విద్యాభ్యాసం, అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధుల రాకతో విద్యార్థినుల్లో ఎంతో ఉత్సాహం కనిపించింది. నాణ్యమైన విద్య, వసతి కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )