తెలుగు కే న్యూస్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితకు నియోజకవర్గ ఇన్చార్జి కావేటి సబిత మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కాగజ్నగర్ పట్టణంలో భారీ ఊరేగింపు జరిగింది. వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం కల్వకుంట్ల కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం నిలుస్తుందని ఆమె, తెలంగాణ సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.