K24 న్యూస్ తెలుగుదేవరకొండ నియోజకవర్గంలోని మండల కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లును నియమించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి కట్టుబడి ఉంటానన్నారు. పాత, కొత్త నాయకులను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.