
కె24న్యూస్ తెలుగు జూన్28. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల కేంద్రలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 07:00 గంటలకు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక హాస్పిటల్ నందు డాక్టర్లు ఎస్.ప్రవీణ్, గురుప్రకాష్, CHO కృష్ణయ్య, HS భగవతి మరియు ANM కోకిల చిన్నారులకు 2 చుక్కల పోలియో మందు వేసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0-5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి 2 చుక్కల పోలియో మందు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ ఎస్.ప్రవీణ్ సూచించారు. చిన్నారి నిండు జీవితానికి 2 చుక్కల పోలియో మందు వేయించడం మరువద్దని డాక్టర్ గురుప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ మరియు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.