

కె24 న్యూస్ తెలుగు జూన్ 19. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అడిషనల్ ఎస్పీల సాధారణ బదిలిలో భాగంగా రాష్ట్ర డి.జి.పి కార్యాలయము నుండి చిత్తూరు జిల్లా కు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా బదిలీపై వచ్చి జిల్లా పోలీస్ కార్యాలయములో బాద్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐ.పి.యస్ ని ఎస్.పి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎస్.షాను 2007వ సం.లో బి.టెక్ పూర్తి చేసి 2018 బ్యాచ్ కు చెందిన డి.ఎస్పీ గా పోలీసుశాఖలో చేరారు. తన విధి నిర్వహణలో భాగంగా నార్త్ విజయవాడ ఏసీపీగా, తిరుపతి రైల్వే డీఎస్పీగా వివిధ కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 2026 సం.లో డి.ఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది.


