శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం అన్నదానం!

కె24న్యూస్ తెలుగు జూలై 18. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి ఆధ్వర్యంలో ప్రతి శనివారం యోగా, ధ్యానంతో పాటు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ధ్యానం మాస్టర్ సుజాత చిన్న మిట్టపల్లి, త్యాగరాజుల రెడ్డి కనికపురం, బండి మాధవిలత,రఘునాథరెడ్డి, మోహన్,గ్యారంపల్లి అంజలి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.