
నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, సెప్టెంబర్ 10, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
జక్రాన్ పల్లి మండలం పరిధిలోని గ్రామం బాలనగర్ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు జక్రాన్ పల్లి మండలంలో కలిగోట్ గ్రామంలో జరిగిన మండల క్రీడా ఉత్సవాలు విద్యార్థినిలు కబడ్డీలో మొదటి బహుమతి పొందారు అదేవిధంగా కబడ్డీలో బాలురు మూడో బహుమతి పొందారు మరియు మార్చ్ ఫాస్ట్ కూడా బహుమతి పొందారు డాన్స్ కాంపిటీషన్లో మరాఠీ గీతంలో అత్యంత అత్యున్నతమైన ప్రతిభ కన్వరించినందుకు బహుమతి అందుకున్నారు. మీరు సాధించిన విజయం పట్ల గ్రామ సర్పంచ్ కొమిరె రాజు, ఉప సర్పంచ్ బోదాసు శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రవి, గంగ నర్సయ్య ,ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సునీత శిక్షణ ఇచ్చినటువంటి సునీల్ కు కృతజ్ఞత తెలియజేశారు. అదేవిధంగా క్రీడాకారులకు అవసరమైన దుస్తులను అందజేసిన గొలుసుల నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విట్టల్ రావు, ఉమాదేవి, సుజాత, రేవతి, నర్సయ్య ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు..




