రామకుప్పం మండలం బల్ల గ్రామంలో ఎస్సై మారయ్య పల్లెనిద్ర!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 05. చిత్తూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామకుప్పం మండలంలోని బల్ల గ్రామంలో ఎస్సై మారయ్య పల్లెనిద్ర నిర్వహించారు. గ్రామంలోని యువత, మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, మత సామరస్యం, శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నపాటి గొడవలను గ్రామ పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకోవాలని, అనవసరంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవద్దని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :