
తెలుగు. కే. న్యూస్. జులై. .17 .అడవిదేవులపల్లి
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు మండల వ్యవసాయ అధికారిని గుర్రం సరిత అవగాహన కల్పించారు. ప్రస్తుత వానాకాలం సీజన్లోఎల్ నినో ప్రభావం ప్రత్యాన్మయ పంటల సాగుపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ నీటి నిల్వలు తగ్గిపోయాయని మరియు రెండు నెలలు వరకు ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలియజేశారు. కావున రైతులు వరి పంటకు బదులు పెసలు, మినుములు, బొబ్బర్లు వంటి పప్పు ధాన్యాలు జొన్న సజ్జ వంటి చిరుధాన్యాలు కంది నువ్వులు ఆముదం వంటి మొదలగు పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు పంటలు సాగుపై రైతులు దృష్టి సారించి నాణ్యమైన దిగుబడులు పొందాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో అడవిదేవులపల్లి ఏఈఓ అబ్దుల్ సమీ, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.







