

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు29. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్ లో అమరావతి ఛాంపియన్ షిప్-2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్రలను జనసేన పార్టీ కార్వేటినగరం టౌన్ అధ్యక్షులు తయ్యూరు రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి, యువతకు ఇస్తున్న ప్రాధాన్యతపై ప్రముఖుల మధ్య చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.






