అందరికీ నమస్కారం. వరినాటు పనుల నిమిత్తం ఉత్తరప్రదేశ్ (యూపీ) రాష్ట్రం నుండి కోస్లీ గ్రామానికి కూలీలు రావడం జరిగింది. ఈ రోజు వారు కోస్లీ గ్రామానికి చెందిన డాంగే రాజబాబు పొలంలో వరినాటు పనులు పూర్తి చేసిన అనంతరం, బోలెరో వాహనంలో తిరిగి తమ నివాసానికి వెళ్తుండగా, కోస్లీ గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. బోలెరో వాహనాన్ని నడిపిన డాంగే రాజబాబు అతి వేగంగా మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల అదుపు తప్పి రోడ్డుపక్కనున్న పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోలెరో వాహనంలో ప్రయాణిస్తున్న సంజీవ్తో పాటు మరో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కూలీలను పనికి పిలిపించిన కోరపల్లి సురేష్ (కోస్లీ గ్రామం) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, బోలెరో వాహన డ్రైవర్ డాంగే రాజబాబుపై సంబంధిత చట్టాల ప్రకారం నవీపేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. July 16, 2026 1:50 am
12 మండలాల ఉపాధ్యాయులకు భౌతిక శాస్త్రం మూడు రోజుల ఉత్తమ బోధన శిక్షణ కార్యక్రమం నిర్వహణ July 15, 2026 8:00 pm