కుమారుడిని కాపాడబోయి తల్లి కూడా అనంత లోకాలకు!

కె24న్యూస్ తెలుగు జూన్ 14. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఫారం పాండ్ గుంతలో ఈత నేర్చుకుంటూ ప్రమాదవశాత్తు మునిగిపోతున్న కుమారుడు సిద్దు(15)ను కాపాడే క్రమంలో తల్లి రేవతి(35) కూడా నీట మునిగి మృతి చెందింది. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత పాసైన కుమారుడితో పాటు తల్లి కూడా మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :