నవీపేటలో బీజేపీ ఆధ్వర్యంలో రైతుల ధర్నా – రాస్తారోకో

నిజామాబాద్ జిల్లా,నవీపేట మండల కేంద్రంలో :-భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని, వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు.
రైతులకు 18 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆందోళనకారులు ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నవీపేట ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను నిరంతరంగా అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, సీనియర్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వీడి, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :