12 మండలాల ఉపాధ్యాయులకు భౌతిక శాస్త్రం మూడు రోజుల ఉత్తమ బోధన శిక్షణ కార్యక్రమం నిర్వహణ

నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, జులై 15, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ లింగన్న మాట్లాడుతూ,మా పాఠశాలలో 12 మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు భౌతిక శాస్త్రం శిక్షణ కార్యక్రమం భాగంగా, గత సోమవారం, మంగళవారం బుధవారం మూడు రోజుల వరకు భౌతికశాస్త్రం బోధన, పై స్టేట్ ఆరుగురు డిఆర్పీలు హైదరాబాద్
స్టేట్ లో శిక్షణ పొంది, 165 మంది ఉపాధ్యాయులకు స్టేట్ ఆర్పి విల్సన్, లక్ష్మీ నాదం, ఎంతో ఉత్సాహంగా మోటివేషన్ భౌతిక శాస్త్రం వృత్తిని నైపుణ్యానికి సంబంధించిన బోధన బోధించారు, ఉపాధ్యాయులు వాళ్ల పాఠశాలలో ఉత్తమమైన విద్యను బోధించుటకు కొరకు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. శిక్షణ కొరకు వచ్చిన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు కు ఎటువంటి అంతరాయం కలగకుండా వారికి ఉచిత భోజన వసతి కల్పించారు , ప్రధాన ఉపాధ్యాయులు ఈ.లింగన్న దగ్గరుండి పర్యశిక్షిస్తూ అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :