
హుజూర్నగర్, జూలై 19 (తెలుగు K24 న్యూస్):
2014 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్–తెలంగాణ ఎస్ఐల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 746 మంది ఎస్ఐలు తమ బ్యాచ్మేట్, కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల క్యాన్సర్తో మృతి చెందిన జి. వెంకటనారాయణ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మృతుడి ఇద్దరు కుమారులకు చెరో రూ.10 లక్షలు, వృద్ధ తల్లిదండ్రులకు రూ.5 లక్షల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు టి. శ్రీధర్తో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు.






