
లక్షెట్టిపేట, జూలై 20 (తెలుగు 24 కె న్యూస్): వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సోమవారం లక్షెట్టిపేట పుష్కరఘాట్ వద్ద పరిశీలించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, తహసీల్దార్ దిలీప్ కుమార్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.






