
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డిలో ఆత్మహత్యకు వెళ్ళిన వ్యక్తిని పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు.ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తిపై కుటుంబ సభ్యులు 100 కు సమాచారం ఇవ్వగా కానిస్టేబుల్ అరుణ్ బృందం 10 నిమిషంలోనే రైల్వే ట్రాక్ పై అతని గుర్తించి సురక్షితంగా కాపాడారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని ఆపదలో ఉంటే డయల్ 100 కు ఆశ్రయించాలని ప్రతి ప్రాణం అమూల్యమైనదని పేర్కొన్నారు.






