
వరంగల్, జూలై 21 (కె24 న్యూస్): వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ అజ్గర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.






