పొన్నంగూరు పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ డే–4.0

కె 24న్యూస్ తెలుగు జూలై 24. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లన్నూరు పంచాయతీ పొన్నంగూరు ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు ప్రియాంక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతి, ప్రభుత్వ సంస్కరణలపై చర్చించారు. ఎస్‌ఎంసీ చైర్మన్ ఎం.పీ. ప్రకాష్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రుల సహకారం అవసరమని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.