

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారిపై గుంతలు మరింత పెరిగాయని, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.







