
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్ మండలం, ఆగస్టు01, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ నియోజవర్గం, ఆలూర్ మండలం పరిధిలోని, శనివారం రోజున సాయంత్రం 4;45, గంటలకు, దేగాం గ్రామం నుండి ఆలూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా నడుపుతూ, బస్సుకు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్రమైన గాయం కావడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి, అక్కడికక్కడే మృతి చెందాడు, మృతుడి వివరాలు తెలియవలసి ఉందని, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.





