
పాల్వంచ మండలం పరిధిపేట్ గ్రామానికి చెందిన చింతకింది భూపతి తమ్ముడు సోమవారం మరణించారు. ఆ కుటుంబాలను గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి , ఉప సర్పంచ్ కోల బాలగౌడ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు సర్పంచ్,ఉప సర్పంచ్ అండగా ఉంటానని పేర్కొని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అదేవిధంగా, బాధిత కుటుంబాలకు 50 కిలోల సన్న బియ్యాన్ని అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తమ్ముడి స్వామి, మేకల మహేశ్వరి, బట్టెంకి రాజు బట్ట శంకర్, బట్ట రాజు, మేకల రాజు, కంఠం సిద్ధారములు, కొంగల భూమేష్, దేవోళ్ల శ్రీకాంత్, శేఖర్, స్వామి ,బదనపల్లి సంతోష్ మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.





