
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
విద్యార్థి సేన కామారెడ్డి పట్టణ కమిటీని నియమించినట్లు విద్యార్థి సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొత్త్మిర్కర్ వినయ్ కుమార్ ప్రకటించారు.
నూతన కమిటీలో పట్టణ అధ్యక్షుడిగా పాషా,పట్టణ ప్రధాన కార్యదర్శిగా చందు,ఉపాధ్యక్షుడిగా నోమన్, కార్యదర్శిగా అశ్వినిలను నియమించారు.అలాగే కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్,శ్రీకాంత్,రాణి,ఫాతిమా కౌసర్,శాంతి,హిమశ్రీలను నియమించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొత్త్మిర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్య బలోపేతం, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించడం వంటి లక్ష్యాలతో విద్యార్థి సేన నిరంతరం పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమం లో
పట్టణ అధ్యక్షుడు పాషా,
పట్టణ ప్రధాన కార్యదర్శి చందు,ఉపాధ్యక్షుడు నోమన్ కార్యదర్శి అశ్విని,
కార్యవర్గ సభ్యులు ప్రవీణ్,శ్రీకాంత్,రాణి,ఫాతిమా కౌసర్, శాంతి, హిమశ్రీ పాల్గొన్నారు.





