

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మంత్రి సీతక్కను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో అత్యధికంగా మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిరిపూర్ సర్పంచ్ భూమన్న, అన్నారం గ్రామానికి చెందిన గడి చంద్రరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగుల బాపూరావు, సొసైటీ చైర్మన్ భరత్ రాజిరెడ్డి, డీసీసీ డెలిగేట్ చిన్న సాయన్న, అశోక్, గంగాధర్, ముఖేష్, ఎన్. గంగారెడ్డి, టి. నర్సయ్య, రమేష్, నవీన్, సుమలత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






