

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు 29. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ప్రతి శనివారం ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇ.రఘునాథరెడ్డి అన్నదానం వితరణ చేయగా, పలువురు ప్రముఖులు పాల్గొని అనాథలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో బి.దామోదర్ రెడ్డి, ఇ.త్యాగరాజులు రెడ్డి,ఇ.విజయ, ఇ. సుబ్బారెడ్డి, ఆర్టీఐ ఆక్టివిస్ట్ బండి పట్టాభిరెడ్డి, బి.మాధవిలత, కె. బాబు రెడ్ది తదితరులు పాల్గొన్నారు.






